అమరావతి : చిత్తూరు జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు మృతి చెందగా మరొకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కంభంవారిపల్లె మండలంలోని గోకరకాలువ గ్రామ పంచాయతీ తుమ్మలవాండ్లపల్లెకు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నూతనకాలవ పంచాయతీ ఆశాదవారిపల్లెకు చెందన వికాస్(14), యువతేజ (8), మరో బాలుడు విజయ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను ఢీకొట్టారు. యువతేజ సంఘటన స్థలంలోనే చనిపోగా తీవ్రంగా గాయపడ్డ వికాస్ను దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయ్కు ఎలాంటి ప్రమాదం జరుగలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కంభంవారిపల్లె ఎస్సై బాలకృష్ణ తెలిపారు.