తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన టికెట్లను సోమవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున టికెట్లు విడుదల కానున్నాయి. మిగతా రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నారు.