తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. నేడు ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 12 వేల చొప్పున టికెట్లు జారీ చేయనున్నారు. ఇక రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమితంగానే దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కాగా, టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే టికెట్లు పొందవచ్చని తెలిపింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.