తిరుమల: వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటాను గురువారం విడుదల చేయనుంది.
కాగా, వచ్చే నెల 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేయనున్నారు. ఇప్పటిదాకా వారికి ఉదయం 10 గంటలకు దర్శనాలకు అనుమతించేవారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు.