తిరుమల : ముంబైలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఈవో ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు . ఈ మేరకు శనివారం వీరు ముంబైలో సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆగస్టు 21న ముంభైలో ఆలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి అప్పగించింది . కాగా రేమండ్స్ కంపెనీ అధినేత గౌతం సింఘానియా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .