తిరుపతి : కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(ontimitta kodanda ramalayam) బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణా(kalayanotsavam)నికి ఈ నెలాఖరులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్ పిఅన్బురాజన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఈవో ఆదివారం ఒంటిమిట్ట లో సమీక్ష (reviews)నిర్వహించారు.
కల్యాణానికి విచ్చేసే భక్తులు వారు కూర్చునే గ్యాలరీల్లోనే అన్నప్రసాదం ,తాగునీరు, అక్షింతలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ గత ఏడాది 3500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈసారి 4వేల మందిని బందోబస్తుకు నియమిస్తున్నామని చెప్పారు. అనంతరం వీరు కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. టీటీడీ జేఈవో వీర బ్రహ్మం, వై ఎస్ ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ , ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ , టీటీడీ సీఈ నాగేశ్వరరావు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.