తిరుపతి : టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా టీటీడీ పరిపాలన భవనంలో ఉన్న బ్యాంకు కార్యాలయాన్ని రూ.20 లక్షలతో ఆధునీకరించారు. సెంట్రల్ ఏసీ, కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్వేర్, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు.
ఇందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఛైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ బోర్డ్ సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈఓ లు శ్రీమతి సదా భార్గవి, వీర బ్రహ్మం పాల్గొన్నారు. బ్యాంకు చైర్ పర్సన్ శ్రీమతి బచ్చల హేమలత, ఉపాధ్యక్షుడు చింతల శివకుమార్, కోశాధికారి చీర్ల కిరణ్, డైరెక్టర్లు గోల్కొండ వెంకటేశం, అమ్మిటి మునివెంకటరెడ్డి, అడసలవల్లి వాసు, కాటా గుణశేఖర్.. చైర్మన్, ఎమ్మెల్యే, బోర్డ్ సభ్యులకు స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.