తిరుమల : వేసవి సెలవుల కారణంగా తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరుగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోయాయి. కొండపై ఉన్న కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 76,963 మంది భక్తులు దర్శించుకోగా 37,422 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు వచ్చిందని వివరించారు.