తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తున్న ఆప్కాన్ సంస్థ అధికారులు, పని చేస్తున్న కూలీలతో సుబ్బారెడ్డి మాట్లాడారు.
పనులు జరుగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేపు రాత్రికి పనులు పూర్తి చేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.