TTD | సిరులతల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది.