తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు కావాలనుకునేవారికి మరో మంచి అవకాశం కల్పించింది. టీటీడీ వెబ్సైట్, అమెజాన్ (Amazon) పోర్టల్లో అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకోవచ్చని దేవస్థాన అధికారులు తెలిపారు. ఇప్పటివరకు టీటీడీ కేంద్రాలు, తిరుమలలో ఇవి అందుబాటులో ఉండేవి
డైరీ, క్యాలెండర్లు, మిగిలిన వాటి ధరలు ఇలా ఉన్నాయి.. 12 పేజీల క్యాలెండర్ రూ.130, పెద్ద డైరీ రూ.150, చిన్నడైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30గా నిర్ణయించారు. మరింత సమాచారంకోసం 0877–2264209 నంబరు ద్వారా ప్రింటింగ్ విభాగం, 9963955585లో ప్రత్యేకాధికారిని సంప్రదించవచ్చని తెలిపారు.