TTD | తిరుమలలో టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేశ్కుమార్ రెచ్చిపోయాడు. శ్రీవారి సన్నిధిలోనే టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం తలుపులు తీయనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్గా మారింది.
వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్కుమార్ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమ వారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పుడే బోర్డు మెంబర్ పక్కనే ఉన్న ఓ వ్యక్తి మహాద్వారం తలుపులు టీటీడీ ఉద్యోగి బాలాజీని సూచించారు. ఈవో, అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు మహాద్వారం గేటు నుంచి ఎవరినీ పంపడం లేదని, ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తలుపులు తీస్తానని బదులిచ్చాడు. మీరేమైనా అడగాలంటే వారినే అడగాలని సూచించారు.
టీటీడీ ఉద్యోగి బాలాజీ చెప్పిన మాటలతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ థర్డ్ క్లాస్ నా కొడుకువి, నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఏయ్ ముందు నువ్వు బయటకు పో అంటూ ఉద్యోగిని బూతులు తిట్టాడు. అయితే అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ తిరుమలలో బూతు పురాణం
శ్రీవారి సన్నిదిలో టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్
మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం… pic.twitter.com/FjL1vhP8Em
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2025