అమరావతి: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి టీఎస్ఆర్ నియామకపు లేఖ అందింది. తక్షణమే ఈ పదవి అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
కేంద్ర మాజీ మంత్రిగా సేవలందించిన డాక్టర్ టీ సుబ్బరామిరెడ్డి.. పలు స్టాండింగ్ కమిటీలకు చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పరంగా కూడా వివిధ కీలక పదవుల్లో కొనసాగారు. కాగా, ఏఐసీసీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి కుమారి శెల్జా, డాక్టర్ అభిషేక్ మను సింఘ్విలను నియమిచారు. అలాగే, అజయ్ కుమార్ లల్లూను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది.