అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పెద్ద చనిపోయాడని దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి కొద్ది గంటల్లోనే కుమారుడు నదిలో గల్లంతు కావడం వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. శ్రీకాకుళం జిల్లా సబలాయ గ్రామానికి చెందిన ఒకరు ఇటీవల చనిపోయాడు. కుటుంబ ఆచారం ప్రకారం కుమారుడు లలిత్సాగర్ ఇవాళ గొట్ట బ్యారేజ్ దిగువన వంశధార నదిలో కర్మకాండ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి నదిలో గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
,