అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లా మర్రిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. వివరాలు .. మర్రిపాలెం ప్రకాష్నగర్లో అపార్టుమెంట్లో నివాసముంటున్న వాచ్మెన్ కుటుంబం ( Watchman Family ) మంగళవారం అర్ధరాత్రి తల్లి సంధ్య, కుమారుడు గౌతమ్ ( 9 ), కూతురు అలేఖ్య (5) నీటి సంప్ ( Water Sump)లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. వీరి ఆత్మహత్యకు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు మృతదేహాలు కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.