అమరావతి : తెలంగాణలో విద్యార్థి కత్తిపోట్లకు ప్రిన్సిపల్ దుర్మరణం చెందిన ఘటన మరవకముందే ఏపీలో టీచర్ దెబ్బలకు కుప్పకూలి విద్యార్థి మృతి ( Student Died ) చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
విశాఖ ( Visaka) వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ( Pranay Teja ) హోం వర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టంది. వెంటనే విద్యార్థి అస్వస్థతకు గురై కుప్పకూలడంతో పాఠశాల సిబ్బంది కేజీహెచ్కు తరలించగా మార్గమద్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.