అమరావతి : విశాఖ జిల్లా గొల్లల ఎండాడ గ్రామంలో విషాదం నెలకొంది . శనివారం ఉదయం ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా ఒక్కసారిగా గోడ కూలింది. అక్కడే పనిచేస్తున్న గోవింద్, తిరుపతి అనే ఇద్దరు కూలీలపై గోడ పడడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. స్థానికుల సమాచారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.