Lion Attack | తిరుపతి (Tirupati) జూపార్క్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మైకంలో లయన్ ఎన్క్లోజర్లోకి చొరబడ్డాడు. సెల్ఫీ కోసం వెళ్లగా అతడిపై సింహం దాడి చేయడంతో వెంటనే అతడు చెట్లుపైకి ఎక్కాడు. చెట్టుపైకి ఎక్కిన అతడు ప్రమాదవశాత్తు కిందపడడంతో అతడిపై సింహం దాడి చేసి చంపివేసింది. గమనించిన జూ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సింహం దాడిలో చనిపోయిన వ్యక్తి రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గజ్జర్గా గుర్తించారు.