అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం(Tragedy) నెలకొంది . జిల్లాలోని మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఇద్దరు జాలరులు(Fishermans) చేపల వేటకు వెళ్తుండగా మార్గమధ్యలో విద్యుత్ తీగలు (Wires) తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామానికి చెందిన నారాయణ మృతి (59), వెంకటేశ్వర్లు (56) అనే ఇద్దరు గురువారం సమీపంలోని చెరువులో చేపల వేటకు ఇంటి నుంచి బయలు దేరారు.
కొద్దిదూరంలో విద్యుత్ తీగలు(Wires) తెగి పడి ఉండడాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్( Electric shock) కు గురై మృతి చెందారు. స్థానికుల సమాచారంతో విద్యుత్ సిబ్బంది కరెంట్ను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.