అమరావతి : కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు పొలంలోని గచ్చులో ఉన్న నీటిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు నీటిలో పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై సాయి, రాజేశ్, కార్తిక్, కమల్ భాషా అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో వీరంతా గచ్చులో సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.