అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం వద్ద సముద్రంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. గుంటూరులోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు విహరయాత్ర కోసం బాపట్ల జిల్లాకు చేరుకున్నారు. రామాపురం వద్ద సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి గురై నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.