అమరావతి : కాకినాడ జిల్లా అన్నవరంలో విషాదం నెలకొన్నది. అక్క,తమ్ముడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. అక్క పోకల శ్రీదేవి(21), తమ్ముడు శివసత్య(18) ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. శంఖవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.