అమరావతి : అన్నమయ్య జిల్లా విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని సంపతికోట వాగులో కారు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఉన్నారు. స్థానికులు గమనించి నలుగురిని కాపాడగా బాలిక కారులోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు.