అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. దంపతులు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమండ్రికి చెందిన దూళి శ్రీను కసింకోట మండలానికి చెందిన దూళి చిన్నారితో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల కసింకోటకు దంపతులు అత్తవారింటి వద్ద గొడవపడ్డారు.
అక్కడి నుంచి బయలుదేరిన ఎలమంచిలి సమీపంలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.