అమరావతి : అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో విషాదం నెలకొంది. దుస్తులు
ఉతకడానికి చెరువువద్దకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ప్రమాదవాశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వీరిలో అక్క పడాల తిరుమల(18) మృతదేహాన్ని వెలికితీయగా చెల్లెలు పడాల యమున(12) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.