అమరావతి : ఏపీలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృత్యువాత పడ్డారు. సత్యసాయి ( Satyasai District ) జిల్లా కదిరి మండలం కుమ్మరవార్ల గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో నిలువ ఉంచుకున్న రాళ్లు బద్దలు చేసే డిటేనేటర్లు పేలాయి. దీంతో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి ( Blast ) ఇంట్లో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలిన ఇళ్లు పూర్తిగా నేలమట్టామయ్యింది. గ్యాస్ పేలుడు దాటికి సమీపంలో ఉన్న ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి . పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు.