అమరావతి : ఏపీలోని తాడేపల్లిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ పండుగను ఉల్లాసంగా చేసుకున్న బాలుడు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యాడు. పెంటపాడు మండలం చిన్నకాపావరం వద్ద ఆకాశ్ (16) అనే బాలుడు స్నేహితులతో కలిసి కాలువలో ఈతకు వెళ్లాడు. ప్రవాహ ఉద్ధృతికి స్నేహితులు చూస్తుండగానే అతడు కొట్టుకుపోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సహయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.