శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడంతో జలకళను తిలకించేందుకు రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో డ్యామ్ సైట్ వద్ద ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో సున్నిపెంట నుంచి దోమలపెంట వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీశైలం డ్యామ్కి రెండువైపులా ఘాట్ రోడ్డు ఉంటుంది. అది చాలా చిన్నగా ఉండటంతో ఒకేసారి అటూ, ఇటూ వాహనాలు వెళ్లడం చాలా కష్టం.