అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజెడ్లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఘాటు వాసన రావడంతో సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి చక్కదిద్దేంతవరకు సెజ్ను మూసివేసి రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో కార్మికులు ఎవరూ రాకపోవడంతో ఆదివారం మరోసారి పెను ప్రమాదం తప్పింది.
మూడు రోజుల క్రితం బ్రాండిక్స్ సీడ్స్ సెజ్ నుంచి విషవాయువు లీక్ కావడంతో మూడు వందల మందికి పైగా మహిళలు అస్వస్తతకు గురయ్యారు. వీరిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై స్పందించి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కాలుష్య నియంత్రణ అధికారులు నిన్నటి నుంచి సెజ్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో విషవాయువు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని సమయంలో మరోసారి విషవాయువు లీక్ కావడం కలకలం రేపుతుంది.