తిరుమల: రేపటి నుంచి తిరుమలలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి 2022 జనవరి 14వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్స్వామి మఠంలో ముప్పైరోజుల పాటు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు.