తిరుపతి : ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు ఇద్దరు ప్రేమికులు. తిరుపతికి చెందిన యువతి, అమెరికాకు చెందిన యువకుడు అమెరికాలో ప్రేమించుకుని తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె టి. హర్షవి బీటెక్ పూర్తి చేసుకుని అమెరికాలోని బోస్టన్ నగరంలో ఓ సంస్థలో ఉద్యోగంలో చేరింది. ఆ సంస్థలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న అమెరికాకు చెందిన డామియన్ ఫ్రాంక్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లింది.
ఈ జంట ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. ప్రియురాలి కోరిక మేరకు ప్రియుడు కుటుంబ సభ్యులు తిరుపతిలో పెళ్లికి ఒప్పుకోవడంతో తిరుపతిలోని ఓ హోటల్లో వీరిద్దరి వివాహం హిందూసాంప్రదాయం ప్రకారం వేడుకగా జరిగింది. పెళ్లి కుమారుడు తండ్రి స్కాట్ బుషార్డ్,తల్లి అన్నా బుషార్డ్, తమ్ముడు, అతడి భార్య వేడుకకు హాజరై వధువు, వరుడిని ఆశీర్వదించారు.