అమరావతి : తిరుపతి నుంచి ఒడిస్సాలోని భువనేశ్వర్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక సమస్యలతో నిలిపివేశారు. రైలు బోగీ చక్రం వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లాలోని వేదాయపాలెం వద్ద నిలిపివేశారు. రైల్వే సాంకేతిక సిబ్బంది అక్కడికి చేరుకుని అరగంట తరువాత మరమ్మతులు చేయడంతో అక్కడి నుంచి తిరిగి బయలు దేరింది .