తిరుమల : ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మంగళవారం హుండీ ఆదాయం రూ.1.89 కోట్లు వచ్చిందని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తెలిపారు. మొత్తం 17,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 7,037 మంది మొక్కులు తీర్చుకోవడంతోపాటు తలనీలాలు సమర్పించినట్లు వెల్లడించారు.