తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం (Chakra Snanam) నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.
శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) , బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ఆదాయం రూ. 2.50 కోట్లు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామిని 67,906 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లు వచ్చిందన్నారు.