Tirumala | భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల రాక తగ్గింది. దీంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. రూ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
సోమవారం నాడు తిరుమల శ్రీవారిని 57,817 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,592 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా ఉంది.
అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవ 8వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరింది.