తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. ఈనెల 26న ఉదయం 10 గంటలకు టికెట్లు, గదుల కోటాను ఆన్లైన్(Online) లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను భక్తులు బుక్ చేసుకోవచ్చని సూచించారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో గదులను బుక్ చేసుకోవచ్చని వివరించారు.
సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsanam) కలుగుతుందని అధికారులు తెలిపారు. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారని పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 72,304 మంది భక్తులు దర్శించుకోగా 32,504 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చిందని వివరించారు.