తిరుమల : తిరుమల (Tirumala ) లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రీం కోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రా ( Supreme Judge) శనివారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వీరచనం, తీర్థ ప్రసాధాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి Dharma reddy) ముందుగా జడ్జికి స్వాగతం పలికారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల దర్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు (compartments) నిండిపోయి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లో దర్శనం కోసం నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో స్వామివారి దర్శనం (Darsan) అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 68,201 మంది భక్తులు దర్శించుకోగా 31,047 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చిందన్నారు.