తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేరుగా కంపార్ట్మెంట్లోకి కాకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు పంపిస్తున్నామని టీటీడీ అధికారులు( ttd officials) వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు ఆరు నుంచి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 63,535 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,349 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు(devotees) సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(hundi income) రూ. 3.96 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుపతి: మహారాష్ట్ర కు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ గురువారం ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ సాయికృష్ణ యాచెంద్ర, సీఈవో షణ్ముఖ్ కుమార్ కు దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి ఈ మేరకు డీడీని అందజేశారు.