తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమల(Tirumala) లో భక్తులకు దర్శనం సులువుగా అవుతుంది. భక్తులు నిన్న 11 కంపార్టుమెంట్లలో ఉన్నప్పటికీ వారిని క్యూపద్దతిలో వెను వెంటనే పంపిస్తుండడతో దర్శనం ఇంతకుముందు కంటే తొందరగా అవుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,072 మంది దర్శించుకోగా 26,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చిందన్నారు.