తిరుమల : తిరుమల (Tirumala )లో స్వామివారి దర్శనానికిగాను నవంబర్ నెల కోటాను టీటీడీ (TTD) శనివారం విడుదల చేసింది. దర్శన టికెట్ల కోటాతో పాటు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేసింది. తోమాల, సుప్రభాతం (Suprabatam), అష్టదశ పాద పద్మారాధన, అర్చన ఆర్జిత సేవల ఆన్లైన్ (Online )లక్కీడిప్ కోసం ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునేందుకు వీలుకల్పించింది. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలని అధికారులు సూచించారు.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈనెల 22 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు, శ్రీవారి ట్రస్టు బ్రేక్ దర్శనం (Break Darsan) టికెట్లను ఉదయం 11 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు వివరించారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో వసతి గదులను బుక్ చేసుకునేందుకు ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు అనుమతి ఉంటుందని తెలిపారు. భక్తులు, యాత్రికులు http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.