తిరుమల : తిరుపతి ( Tirupati ) లోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsan) టోకెన్ల జారీ పున: ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే.
వైకుంఠ ద్వార దర్శనం రేపటితో(సోమవారం రాత్రి) తో పూర్తవుతున్న దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ ఉదయం 4 గంటల నుంచి మంజూరు చేస్తారని వివరించారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని వివరించారు.
తిరుమలలో 5 లడ్డూ కౌంటర్లకు ఎస్బీఐ స్పాన్సర్ షిప్
తిరుమల (Tirumala) లోని లడ్డూ కాంప్లెక్స్ లో గల 5 కౌంటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ షిప్ అందించింది. ఈ మేరకు ఈ కౌంటర్లలో ఆదివారం టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, బ్యాంకు ఎండీ శ్రీనివాస శెట్టి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటు పేష్కార్ శ్రీనివాసులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.