తిరుమల : తిరుమలలో భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు(TTD Officers) వెల్లడించారు.
నిన్న స్వామివారిని 79,087 మంది భక్తులు దర్శించుకోగా 35,640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Income) రూ. 4.41కోట్లు వచ్చిందని వివరించారు.
జూన్ 29 నుండి జులై 5దాకా చతుర్వేద హవనం
లోక శ్రేయస్సు కోరుతూ తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో జూన్ 29వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు జేఈవో సదా భార్గవి తెలిపారు. తిరుపతి లో తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయం తో పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దాదాపు 30 మంది నుంచి 35 మంది రుత్వికులు చత్రుర్వేద హవనం నిర్వహణలో పాల్గొంటారని చెప్పారు.
హోమ నిర్వహణకు అవసరమయ్యే ద్రవ్యాలు ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. వేదిక నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. గార్డెన్ విభాగం పుష్పాలంకరణలు, విద్యుత్ విభాగం విద్యుత్ అలంకరణలు ఆకట్టుకునేలా ఉండాలని ఆదేశించారు. సాయంత్రం వేళల్లో భక్తులకోసం వేద ప్రవచనాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.