హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల కోసం టికెట్ల జనవరి కోటా షెడ్యూల్ను టీటీడీ అధికారులు బుధవారం విడుదల చేశారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లతోపాటు ఆర్జిత సేవ లక్కీడిప్ రిజిస్ట్రేషన్, ఎర్న్డ్ సర్వీస్, వర్చువల్ సేవ, అంగప్రదక్షిణ టికెట్ల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ టికెట్ల కోటా విడుదలవుతుంది.
20న ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. 21న ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదలవుతాయి. రూ.500, రూ.వెయ్యి వర్చువల్ సేవా టికెట్లను అదే రోజున మధ్యాహ్నం విడుదల చేస్తారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ (బ్రేక్ దర్శనం), మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ టికెట్లు విడుదలవుతాయి. 24న ఉదయం 11 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభమవుతుంది. ఆయా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.