తిరుమల : తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండి ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 82,999 మంది భక్తులు(Devotees) దర్శించుకోగా 38,875 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.27 కోట్లు వచ్చిందని వివరించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో హరికథా కార్యక్రమాలు ప్రారంభం
ధర్మప్రచారంలో భాగంగా తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం నుంచి హరికథా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆలయంలో హరికథా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు రామాయణంలో సుందరకాండ అనే అంశంపై భాగవతారిణి వరలక్ష్మి హరికథ వినిపించారు.