తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల(Tirumala) గోవింద నామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. భక్తుల రాకతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
నిన్న స్వామివారిని 72,299 మంది భక్తులు దర్శించుకోగా 36,378 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.92 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
కాగా శనివారం సుప్రీం కోర్టు జడ్జి(Supreme Court Judge) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొని వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి రాక సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.