తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల(Tirumala) గిరిలోని 18 కంపార్ట్మెంట్లు( Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 71,132 మంది భక్తులు దర్శించుకోగా 26,963 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 4.06 కోట్లు వచ్చిందని వివరించారు.
సెప్టెంబరు 1న డయల్ యువర్ ఈవో
సెప్టెంబరు 1న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వెల్లడించారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని, ఇందుకు భక్తులు నెంబరు 0877-226326 ఫోన్లో సంప్రదించాలని సూచించారు.