అమరావతి : వర్షాల ( Rains ) పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతము నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు .
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ( Meteorological Department ) తెలిపింది. ఉరుములు, పిడుగులతో ఈదురుగాలు వీచే అవకాశముందని హెచ్చరిక చేసింది. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించారు. మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్ విజయనగరం, మన్యం, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు.