ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున బేస్తవారపేట మండలం శెట్టిచెడ్ల ఎక్స్రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్, శ్రీనివాస్, రాహుల్గా గుర్తించారు.
చాయ్ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్పాజాకు బైకు వెళ్తుండగా.. గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వారిని ఢీకొట్టిందని తెలిపారు. ముగ్గురు యువకులు 20, 21 ఏండ్ల వయస్సు వారేనని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.