అమరావతి : దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిని ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా(Tirupati) శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. జిల్లాలోని తొట్టంబేడు మండలం కంచనపల్లికి చెందిన దయాసాగర్ రెడ్డి (54) అతడి భార్య మధుమతి, కొడుకు డాక్టర్ సూర్యతేజ(33), కోడలు డాక్టర్ మౌనిక తిరువన్నామలైలోని అరుణాచల గిరిప్రదక్షిణకు కారులో బయలు దేరారు.
గిరి ప్రదక్షిణ(Giripradakshinam) అనంతరం తిరుగుప్రయాణంలో కంచి సమీపంలో వీరి కారు(Car)ను మినీ బస్సు ఢీ కొట్టడంతో కారు బోల్తా పడి తీవ్రగాయాలతో దయాసాగర్రెడ్డి, కుమారుడు సూర్యతేజ, కోడలు మౌనిక మృతి చెందారు. మధుమతి కి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.