అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వల్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొనగా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒంగోలుకు చెందిన పరమేశ్, పవన్, శ్రీనివాస్ గా గుర్తించారు. ప్యారిస్ పర్యటనకు వెళ్లి రాత్రి చెన్నైలో దిగిన ముగ్గురు స్నేహితులు రోడ్డు మార్గంలో ఒంగోలుకు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.